News

తలసానిపై రాష్ట్రపతికి ఫిర్యాదు : ఎల్. రమణ


తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌పై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఫిర్యాదు చేశామని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్‌ రమణ తెలిపారు. తెలంగాణ తెలుగుదేశం నేతలు ఆదివారంనాడు రాష్ట్రపతిని కలుసుకున్న సమయంలో సిఎం కేసీఆర్‌పై కూడా ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌ పెత్తందారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని , ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని విలేకర్లతో మాట్లాడుతూ తెలిపారు. తలసాని శాసన సభ్యత్వాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి విన్నవించినట్లు చెప్పారు